ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..ఓటర్లు 21,41,387 మంది

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..ఓటర్లు 21,41,387 మంది
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓటర్లు 9,45,094 మంది
  •     ఖమ్మం జిల్లా ఓటర్లు 11,96,293 మంది
  •     రెండు జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికం

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21లక్షల41వేల387 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. బుధవారం జిల్లాల వారీగా ఓటర్ల వివరాలను కలెక్టర్లు ప్రకటించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 9లక్షల45వేల094 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ డాక్టర్​ ప్రియాంక అల తెలిపారు. ఇందులో మగవారు 4లక్షల61వేల315మంది, మహిళలు 4లక్ష83వేల741 మంది, ట్రాన్స్ జెండర్లు 38మంది ఉన్నట్లు స్పష్టం చేశారు. దివ్యాంగ ఓటర్లు 14,130 మంది, 80 ఏండ్లు నిండిన ఓటర్లు 13,082 మంది ఉన్నట్లు చెప్పారు.

1,095 పోలింగ్​కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా పాల్వంచ మండలంలో 85,785 మంది, అతి తక్కువగా ఆళ్లపల్లి మండలంలో 8,491 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 11లక్షల 96వేల293 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్​వి.పి.గౌతమ్​తెలిపారు. ఇందులో మగవారు 5 లక్షల 80 వేల 441 మంది, మహిళలు 6లక్షల15 వేల 807 మంది, ట్రాన్స్ జెండర్లు 75 ఉన్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 1,439 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.